తెలంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం..

BB6 TELUGU NEWS CHANNEL
బిక్నూరు మండలం తలమండ్ల సెక్షన్‌లో ట్రాక్‌పై వరద ప్రవహిస్తుండటంతో పలు రైళ్లను దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే.. అక్కన్నపేట-మెదక్‌ సెక్షన్‌ పరిధిలో పలు రైళ్లను మళ్లించిన రైల్వే.. ముంబై – లింగంపల్లి.. లింగంపల్లి – ముంబై.. ఓఖా – రామేశ్వరం.. భగత్ కి కోఠి – కాచిగూడ.. నిజామాబాద్‌ – తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసిన సౌత్ సెంట్రల్‌ రైల్వే.. కాచిగూడ – మెదక్‌ ట్రైన్‌ పాక్షికంగా రద్దు

సిరిసిల్ల: గంభీరావుపేటలో భారీ వర్షం
ఎగువ మానేరున నుంచి దిగువకు నీరు విడుదల..మానేరు వాగులో పశువుల కాపరి నాగయ్య గల్లంతు..గల్లంతైన నాగయ్య కోసం కొనసాగుతున్న గాలింపు..మానేరు వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులు…రైతులను రక్షించేందుకు అధికారుల యత్నం

కామారెడ్డిలో భారీవర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్..తలమట్ల దగ్గర రైలు పట్టాల పైనుంచి వరద ప్రవాహం..12 రైళ్ల రాకపోకలకు అంతరాయం..నాలుగు రైళ్లను దారి మళ్లించిన అధికారులు..ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది..కామారెడ్డిలో భారీ వర్షానికి పలు రైళ్లు రద్దు..అశోక్‌నగర్‌లో రైల్వేట్రాక్‌పై వరద ప్రవాహం..వరద ప్రవాహంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం
మెదక్‌: రామాయంపేటలో రెస్క్యూ ఆపరేషన్‌
వరదలో చిక్కుకున్న 300 మంది విద్యార్థినులు సేఫ్‌..విద్యార్థినులను రక్షించిన రెస్క్యూ టీమ్
నీట మునిగిన రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్‌…సురక్షిత ప్రాంతానికి విద్యార్థినుల తరలింపు..