గండీడ్ కస్తూర్బా పాఠశాలలో ఎమ్మార్వో, సర్పంచ్ ఆకస్మిక తనిఖీ

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలంలోని, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ,అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ రేగరి భగవంత్ రెడ్డి మరియు, గండీడ్ మండల ఎమ్మార్వో, రాజగోపాల్ కలిసి పాఠశాలకు వెళ్లి ,వసతులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థుల హాజరు రిజిస్టర్, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన మెనూ, నాణ్యతను పరిశీలించారు. వంటగది, బియ్యం నిల్వలు, కూరగాయలను తనిఖీ చేశారు. బాలికల వసతి గృహంలో పడకలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడిన అధికారులు చదువు ఎలా సాగుతుంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.

Related News

కస్తూర్బా పాఠశాలల్లో బాలికలకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీతో పాఠశాల సిబ్బందిలో కదలిక వచ్చింది.