తెలంగాణలో ప్రజా సంక్షేమ విప్లవం
ఒకేసారి 9 కొత్త పథకాలను ప్రకటించిన ప్రభుత్వం!

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. సమాజంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ఒకేసారి 9 సరికొత్త సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. విద్య, వైద్యం, ఉపాధి మరియు సామాజిక భద్రతే లక్ష్యంగా ఈ పథకాలను రూపొందించారు.

పథకాల పూర్తి వివరాలు:

1..ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం: పేద కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచేందుకు, వారి ఆర్థిక అవసరాలకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

Related News

2..చేయూత: వృద్ధులు, వితంతువులు మరియు ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయనున్నారు.

3..తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు: కార్పొరేట్ స్థాయి విద్యను సామాన్యులకు చేరువ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాలల స్థాపన.

4..విద్యార్థులకు ఉచిత బ్రేక్ ఫాస్ట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉదయం పూట నాణ్యమైన అల్పాహారాన్ని అందించనున్నారు.

5..నగదు రహిత ఆరోగ్య భద్రత: సామాన్యుడిపై వైద్య ఖర్చుల భారం పడకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పొందే సౌకర్యం.

6..ఉద్యోగుల ప్రమాద బీమా: ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భద్రత కల్పిస్తూ, విధి నిర్వహణలో లేదా ప్రమాద వశాత్తూ జరిగే నష్టాలకు భారీ బీమా రక్షణ.

7..సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్: విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందాలనుకునే నిరుద్యోగ యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించడం.

8..ఏటీసీ ట్రైనీలకు స్కాలర్‌షిప్స్: సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న ఏటీసీ ట్రైనీలకు చదువులో వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌ల మంజూరు.

9..ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: ఇప్పటివరకు పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేయనున్నారు.

ఈ పథకాల అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ఫలాలు అందేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe