BB6 TELUGU NEWS CHANNEL కరీంనగర్ ల్లో సంచలనం సృష్టించిన జ్యువెలరీ షాపు దోపిడీ కేసుకు సంబంధించి పోలీసులు కీలక పురోగతి సాధించారు. కాల్పులు జరిపి నగదు, నగలతో పరారైన నిందితుల చిత్రాలను ఉన్నతాధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఈ ముఠా ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
కరీంనగర్ నగరంలో ఆదివారం పట్టపగలే జరిగిన భారీ దోపిడీ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక బంగారు దుకాణంలోకి చొరబడిన ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి భారీ మొత్తంలో నగలు, నగదు ఎత్తుకెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ సాహసోపేత దోపిడీని సీరియస్గా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల ఫోటోలను సేకరించి వాటిని బహిరంగ పరిచారు.
దొంగల ఫోటోలు రిలీజ్ చేసిన పోలీసులు
నిందితుల గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి లక్ష రూపాయల పారితోషికం ఇస్తామని పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. ఈ దొంగల చిత్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే చేరవేశారు. సోషల్ మీడియా వేదికగా, వాట్సాప్ గ్రూపుల ద్వారా సాధారణ పౌరులకు కూడా ఈఫోటోలను షేర్ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని ప్రజలను కోరారు.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరితో పాటు నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పరిధిలోని పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ప్రధాన రహదారులు, చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. దొంగలు ఇతర జిల్లాలకు లేదా పొరుగు రాష్ట్రాలకు పారిపోయే అవకాశం ఉన్నందున రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద నిఘా పెంచారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టారు.
సిసి ఫుటేజ్ దృశ్యాలు
ఈ కేసులో సమాచారం ఇవ్వదలచిన వారు డయల్ 100 లేదా కరీంనగర్ 2 టౌన్ ఇన్ స్పెక్టర్(8712670762), ఏసీపీ కరీంనగర్ టౌన్(8712670711), ఎస్బీ కంట్రోల్ కరీంనగర్(8712670713) నంబర్లకు ఫోన్ చేయవచ్చు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.దర్యాప్తుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని వారు విజ్ఞప్తి చేశారు. నిందితులు ఆయుధాలు కలిగి ఉన్నందున నేరుగా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడమే శ్రేయస్కరమని సూచించారు.
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన కావలి పెంటయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంటు తీగల పై పడి మృతి చెందాడు. మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ...
BB6 TELUGU NEWS CHANNEL విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా కేవలం లీవ్ లెటర్ సమర్పించి విధులకు గైర్హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇ...
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రేకింగ్ న్యూస్ : రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి పనికి ఓ రేటు అన్నట్లు వ్యవహార శైలి కొనసాగు...
BB6 TELUGU NEWS CHANNEL బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ జోరందుకోనున్నాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జి...
BB6 TELUGU NEWS CHANNEL తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ఆధ్వర్యంలో తాండూరు క్యాంప్ కార్యాలయంలో తాండూరు పట్టణ BLAలతో నిర్వహించిన సమీక్ష సమావ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్న వెంకటయ్య వద్ద రెండు గేదేలు రెండు ఎద్దులు, బర్రె దూడలు ...
BB6 TELUGU NEWS CHANNEL Latest News : విద్యార్థులకు ఊహించని విధంగా ఈనెల జూలై 24వ తేదీన విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వరుసగా మూడు రోజులు పాఠశాల...
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన కావలి పెంటయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంటు తీగల పై పడి మృతి చెందాడు. మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ ...
BB6 TELUGU NEWS CHANNEL విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా కేవలం లీవ్ లెటర్ సమర్పించి విధులకు గైర్హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇ...
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రేకింగ్ న్యూస్ : రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి పనికి ఓ రేటు అన్నట్లు వ్యవహార శైలి కొనసాగు...
BB6 TELUGU NEWS CHANNEL బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ జోరందుకోనున్నాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జి...
BB6 TELUGU NEWS CHANNEL తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ఆధ్వర్యంలో తాండూరు క్యాంప్ కార్యాలయంలో తాండూరు పట్టణ BLAలతో నిర్వహించిన సమీక్ష సమావ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్న వెంకటయ్య వద్ద రెండు గేదేలు రెండు ఎద్దులు, బర్రె దూడలు ...
BB6 TELUGU NEWS CHANNEL Latest News : విద్యార్థులకు ఊహించని విధంగా ఈనెల జూలై 24వ తేదీన విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వరుసగా మూడు రోజులు పాఠశాల...