మహబూబ్ నగర్ లో ఎర్ర సత్యం విగ్రహానికి పూలమాల వేసి పాలమూరు గడ్డపై అడుగుపెట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శ్రీ. తీన్మార్ మల్లన్న

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో  సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం(STIF) ఆధ్వర్యం “Open talk with Mallanna” కార్యక్రమానికి హాజరైన టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న… కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు బీసీల సంక్షేమం కోసం పని చేసిన ఎర్ర సత్యం గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం టీఆర్పీ పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి ఏనుగొండ ఇందిర రోడ్డులో గల ఓమ్ కన్వెన్షన్ హాల్ లో జరిగే “open talk with Mallanna” కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు,కార్యకర్తలు మరియు బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.