శబరిమల ఆలయంలో మహిళ మృతి – కేరళ హైకోర్టు ఆగ్రహం

BB6 TELUGU NEWS CHANNEL
శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. దర్శనానికి వచ్చిన ఓ మహిళ క్యూలైన్‌లో స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మృతి చెందింది. భారీ రద్దీ మధ్య ఏర్పాట్లు సరిపోలేదన్న అనుమానాల నేపథ్యంలో ఈ ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు దేవస్థానం బోర్డును తీవ్రంగా మందలించింది. రద్దీకి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు నెలల ముందే ఏర్పాట్లు చేయవచ్చుగదా? ఎందుకు చేయలేదు? అని కోర్టు ప్రశ్నించింది. యాత్రికుల భద్రతపరంగా నిర్లక్ష్యం జరిగితే ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

వచ్చే శుక్రవారం లోపు తీసుకున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలపై పూర్తి నివేదిక సమర్పించాలని దేవస్థానం బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe