కుల్కచర్ల గిరిజన బాలురు ఆశ్రమ పాఠశాలలో “బాయ్స్ ఫర్ చేంజ్ –ఫైర్ ప్లేస్” పేరుతో 10 రోజుల కార్యాచరణాత్మక శిక్షణా శిబిరం ప్రారంభం

BB6 TELUGU NEWS 11 Aug 2025 :
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ వారు,ఆగస్ట్ 11, 2025:
బాలికల సాధికారతపై దృష్టి పెట్టిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ వాయిస్ 4 గర్ల్స్, ఇప్పుడు బాలుర కోసం కూడా ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తూ,జీవన నైపుణ్యాలు మరియు లింగ సమానతపై అవగాహన పెంచడంపై దృష్టిసారించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు *సుందర్ రాజ్* అన్నారు.ఈ క్రమంలో కుల్కచర్ల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో “బాయ్స్ ఫర్ చేంజ్ –పర్ ప్లేస్” పేరుతో 10 రోజుల కార్యాచరణాత్మక శిక్షణా శిబిరం ప్రారంభమైంది.వాయిస్ 4 గర్ల్స్ సంస్థ విశ్వసించేది సమాజంలో మార్పు అనేది కేవలం బాలికలతోనే కాదు,బాలురలోనూ తలెత్తాలి.బాల్యంలో సరైన మార్గదర్శనం లేకపోతే,వారు పురుషులుగా ఎదిగిన తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని ఈ సంస్థ భావిస్తోంది. అందుకే,ప్రతీ సంవత్సరం బాలుర కోసం రెండు ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.7 లక్షల మంది విద్యార్థులు ఈ శిబిరాల ప్రయోజనాన్ని పొందారు.ఈసారి కుల్కచర్ల పాఠశాలలో జరుగుతున్న శిబిరానికి ఫీల్డ్ కోఆర్డినేటర్ *జే కార్తిక్ రమణ సాయి* సమర్థవంతంగా నాయకత్వం వహించగా,ఐదుగురు *రిత్విక్ చరణ్,హర్ష్ పటేల్,ప్రణీత్ పాల్,సంజయ్ రెడ్డి* కౌన్సిలర్లు   చురుకుగా పాల్గొంటున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు *G సుందర్ రాజ్ సార్* శిబిరానికి మార్గనిర్దేశనం చేసి,ప్రోత్సాహం అందిస్తున్నారు.విద్యార్థులకు లింగ సమానత,మానసిక ఆరోగ్యం, సంబంధాలు,హక్కులు,బాధ్యతలు వంటి కీలక అంశాలపై చర్చలు, సమూహ చటువాట్లు మరియు ఆటల ద్వారా శిక్షణగా ఇవ్వబడుతోంది.ప్రతి రోజూ విద్యార్థులు ఎనర్జైజర్ ఆటలతో ప్రారంభించి, అనుభవాలను పంచుకునే సెషన్లు మరియు ఆలోచనను ఉద్రేకపరచే చర్చల్లో పాల్గొంటున్నారు.ఈ క్రియాకలాపాలు బాలురలో స్వీయ అవగాహన పెంపొందించడమే కాకుండా సమానత్వంపై దృక్పథాన్ని నిర్మించడంలో సహాయపడుతున్నాయి.వాయిస్ 4 గర్ల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ *సునీల్ , ప్రాజెక్ట్ మేనేజర్  బాను సమీర్* ఇలా వ్యాఖ్యానించారు:
“బాలురూ వాయిస్ శిబిరాల్లో పాల్గొన్నప్పటి నుంచి తమ చుట్టూ ఉన్న లింగ వివక్షను ప్రశ్నించడం మొదలుపెట్టారు.‘అబ్బాయిలు ఏడవకూడదు’,అమ్మాయిలు వంటింట్లో ఉండాలి’ వంటి రుఢీబద్ధమైన అభిప్రాయాలను తిరస్కరిస్తున్నారు.ఈ మార్పు చూడడం గర్వకారణం.”
శిబిరం ముగింపు కార్యక్రమంలో, విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను సృజనాత్మక ప్రజెంటేషన్‌ల రూపంలో ప్రదర్శిస్తారు.అనంతరం వారందరికీ ధృవీకరణ పత్రాలు పంపిణీ చేయబడతాయి. ఈ విధంగా, వారు లింగ సమానత కోసం పోరాడే యువ అంబాసిడర్లుగా ఎదిగే దిశగా ముందడుగు వేస్తారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజేంధర్ రాథోడ్, గోపాల్, సతీష్, రమేష్,రాములు,రాజు, నర్సింహులు, శ్రీకాంత్, వంశీ కృష్ణ,వెంకటయ్య, కృష్ణ, మరియు  ఏఎన్ఎం, విద్యార్థులు ఉన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe