జిల్లా వ్యాప్తంగా 30-పోలీస్ యాక్ట్ అమలు- మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్

జిల్లా వ్యాప్తంగా 30-పోలీస్ యాక్ట్ అమలు
ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదు – జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్‌నగర్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని 01 సెప్టెంబర్ 2026 నుండి 30 సెప్టెంబర్ 2026 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

సెక్షన్–30 అమలులో ఉన్న కాలంలో సంబంధిత పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు, సమావేశాలు లేదా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే కార్యక్రమాలు నిర్వహించరాదని ఎస్పీ సూచించారు.

నిబంధనలను ఉల్లంఘించి ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదేవిధంగా సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారం, వదంతులు, మత విద్వేషాలు లేదా సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే పోస్టులు, వీడియోలు, సందేశాలను ప్రచారం లేదా ప్రసారం చేసే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని, సభలు, సమావేశాలు, ర్యాలీలు లేదా ఇతర బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారు సంబంధిత పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని జిల్లా ఎస్పీ సూచించారు.

జిల్లాలో శాంతిభద్రతలు, ప్రజా ప్రశాంతత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కోరారు.