BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ ఈగిల్ ఫోర్స్కు చెందిన ఖమ్మం ప్రాంతీయ మాదకద్రవ్యాల నియంత్రణ సెల్, ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని దోర్నకల్ పోలీసుల సమన్వయంతో, హైదరాబాద్కు భారీ పరిమాణంలో ఎండు గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు స్పందించి, ఒక బజాజ్ పల్సర్ మోటార్సైకిల్ మరియు ఒక మారుతి ఎర్టిగా కారును అడ్డగించి, మొత్తం 26.829 కేజీల బరువున్న 17 గంజాయి ప్యాకెట్లు ఉన్న మూడు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు: నిందితులు చంద్రశేఖర్, విజయ్ కాంత్, వినోద్ మరియు శశికాంత్, ఒడిశాకు చెందిన కొప్పు రాజు అనే వ్యక్తి నుండి కిలోకు 3,000 రూపాయల చొప్పున మొత్తం 78,000 రూపాయలకు 26.892 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, భద్రాచలం నుండి ఎల్లందు, లింగాల క్రాస్ రోడ్ మరియు దోర్నకల్ మీదుగా హైదరాబాద్కు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. బహిరంగ మార్కెట్లో 13.41 లక్షలు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు, వాహనాలు, ప్యాకింగ్ సామాగ్రి మరియు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీన పరచుకొని చట్టపరమైన ప్రక్రియ అనంతరం జప్తు చేశారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సామాగ్రిని ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని దోర్నకల్ పోలీస్ స్టేషన్ SHOకి అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుడు వాస్కుల రాజు (తండ్రి వెంకటయ్య, 26 సంవత్సరాలు, నివాసం కొత్తపేట, ఆర్.కె.పురం, రంగారెడ్డి జిల్లా, దర్యాప్తు కొనసాగుతోంది.
స్వాధీనం చేసుకున్నవి:
➤ రూ. 13,41,450/- విలువైన 26.829 కిలోల గంజాయి.
➤ ఒక పల్సర్ మోటార్ సైకిల్
➤ ఒక ఎర్టిగా కారు
➤ 4 మొబైల్ ఫోన్లు
➤ వాంకుడోతు వినోద్ S/o లేట్ కోటేష్, 27 సంవత్సరాలు, డ్రైవర్, R/o కస్నా తండా గ్రామం ఖమ్మం రూరల్.
➤ వల్లెపు శేషికాంత్ S/o బాబురావు, 23 సంవత్సరాలు, R/o వడ్డెర బస్తీ, ఆండాళ్నిలయం దగ్గర, మూసారం బాగ్, హైదరాబాద్.
➤ పెంటమ్ చంద్రశేఖర్, S/o లక్ష్మణ్, 20 సంవత్సరాలు, R/o అంబర్పేట్, హైదరాబాద్. అంబర్పేట్, హైదరాబాద్.

