ఏసీబీ దాడులు – వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

BB6 TELUGU NEWS CHANNEL
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు (Assistant Director) సుందరి కిరణ్ కుమార్‌పై తెలంగాణ అవినీతినిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets – DA) కేసు నమోదు చేశారు.

Telangana ACB అధికారులు 21-02-2026న నిందితుడి నివాసంతో పాటు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన మొత్తం ఏడు చోట్ల ఒకేసారి ప్రాథమిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ స్థాయిలో స్థిర, చర ఆస్తులు బయటపడ్డాయి.

సోదాల్లో లభించిన ఆస్తులు:
వ్యవసాయ భూములు: మొత్తం 97.03 ఎకరాలు
ఓపెన్ ప్లాట్లు: 3
ఫ్లాట్లు: 2
ఇల్లు: 1
వాహనాలు: 5
ఇన్సూరెన్స్ పాలసీలు: రూ. 5,50,000 విలువైనవి
పెట్టుబడులు: నిందితుడు మరియు కుటుంబ సభ్యుల పేర్లపై రూ. 50,00,000

ఈ ఆస్తుల డాక్యుమెంట్ విలువ సుమారు రూ. 4 కోట్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేయగా, మార్కెట్ విలువ మాత్రం దీని కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని సమాచారం.

మరిన్ని ఆస్తుల గుర్తింపు, ఆదాయానికి మించిన ఆస్తుల పూర్తి వివరాల కోసం విచారణ కొనసాగుతోంది. సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకుని అధికారులు విశ్లేషణ చేపట్టారు.

ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరినట్లయితే ప్రజలు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.

అలాగే వాట్సాప్ (9440446106),
ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు అధికారిక వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

ఫిర్యాదుదారుల/బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది..

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe