BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి A. Revanth Reddy మంగళవారం ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం ఎన్నికల షెడ్యూల్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఒకే విడతలో పోలింగ్కు యోచన
మున్సిపల్ ఎన్నికల వేగాన్ని కొనసాగిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా తక్కువ వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం 15 నుంచి 20 రోజుల్లో మొత్తం ప్రక్రియ ముగించేలా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే అంశంపై చర్చ జరుగుతోంది. ఇలా చేస్తే యంత్రాంగంపై భారం తగ్గడమే కాకుండా, స్థానిక సంస్థల్లో త్వరగా ప్రజాప్రతినిధులను నియమించి పాలనను వేగవంతం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
పరీక్షలు, బడ్జెట్ సెషన్ దృష్టిలో నిర్ణయం
రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు.
పరీక్షలకు ఆటంకం కలగకుండా పోలింగ్ తేదీలను ఖరారు చేయడంపై విద్యాశాఖ, ఎన్నికల సంఘం అధికారులతో సీఎం సమాలోచనలు జరపనున్నారు. అధికారుల నివేదిక ఆధారంగా ఎన్నికలు పరీక్షల ముందు లేదా తరువాత నిర్వహించాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
భారీ స్థాయిలో ఖాళీలు రాష్ట్రంలో మొత్తం 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఇవన్నీ అధికారుల ఆధీనంలో కొనసాగుతున్నాయి. మార్చిలోపే ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక సంస్థలకు పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు (సుమారు ₹500 కోట్లు పైగా) విడుదల చేసుకునే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.
త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణపై కసరత్తు
18
Feb