BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం ,వెన్నాచేడ్ గ్రామంలో చిలకల కృష్ణమ్మ w/o నరేష్ ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన గండీడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగుల పుల్లారెడ్డి. వారు మాట్లాడుతూ నిరుపేదల అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఇంకా ఎవరైనా నిరుపేదలు ఉంటే ఏప్రిల్ మాసంలో మరిన్ని ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని తొందర్లోనే పూర్తయిన ఇందిరమ్మ గృహాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాఫ్లాపూర్ సర్పంచ్ లక్ష్మారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆశన్న,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొటాల చిన్నయ్య, పులిందర్ రెడ్డి, శరణప్ప, రాములు గౌడ్, నర్సింలు గౌడ్, గువ్వల వెంకటయ్య, ఇజాస్ పాషా, ఇమ్రాన్, బసప్ప, తదితరులు పాల్గొన్నారు.
