అంచన్ పల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన గండీడ్ మండల ఎంఈఓ

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని అంచన్ పల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను మండల ఎంఈఓ రుద్రారం జనార్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు ఇతర రిజిస్టర్లు పరిశీలించారు. ప్రతి ఉపాధ్యాయుడు డైరీ కచ్చితంగా రాయాలని  చెప్పారు.