BB6 TELUGU NEWS CHANNEL
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగ రెండు రోజులు నిరసన దీక్షలు చేపట్టిన PRTU సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం PRTU తెలంగాణ ఆధ్వర్యంలో సమ్మెకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం పలు కీలక డిమాండ్లతో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు.
ముఖ్య డిమాండ్లు:
51% ఫిట్మెంట్తో PRCను తక్షణం ప్రకటించాలి
పెండింగ్లో ఉన్న 4 DAలను విడుదల చేయాలి
ట్రాన్స్ఫర్లు, పదోన్నతులు వెంటనే చేపట్టాలి
CPS రద్దు చేసి పాత పింఛన్ విధానం (OPS) అమలు చేయాలి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించి 2026 నుంచి అమలు చేయాలి.
విద్యా రంగానికి సంబంధించిన డిమాండ్లు:
TET సర్టిఫికెట్ గడువు జీవితకాలం వరకూ చెల్లుబాటు చేయాలి
SSAలో పనిచేస్తున్న ఉద్యోగులు, KGBV సిబ్బందికి మినిమమ్ టైమ్ స్కేల్ (MTS) అమలు చేయాలి
కాంట్రాక్ట్, CRT ఉపాధ్యాయులకు MTS వర్తింప చేయాలి
PET, పండిట్ పోస్టులను ఉన్నతీకరించాలి
సింగరేణి కాలనీల్లో పనిచేస్తున్న భద్రతా సిబ్బందికి 12 నెలల మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలి
ఇతర ముఖ్య అంశాలు:
2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలి
శ్రీ రాంపూర్ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 10 మంది ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి
గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలి
AHRA ఉత్పత్తులను వెంటనే అమలు చేయాలి
జిల్లా ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు తొలగించాలి కొత్త పీఆర్సీలో 17% HRAను అమలు చేయాలి.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేపట్టనున్నట్లు హెచ్చరించారు.
ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని PRTU తెలంగాణ స్పష్టం చేసింది.