చేవెళ్ల గురుకుల ప్రిన్సిపాల్ మాలతి వెల్లడి
BB6 TELUGU NEWS CHANNEL రంగారెడ్డి,ఫిబ్రవరి
2026-27 విద్యాసంవత్సరానికి 5, 6, 7, 8, 9వ తరగతుల ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ప్రిన్సిపాల్ మాలతి తెలిపారు.ఇందులో భాగంగా చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించిన అర్హత ప్రవేశ పరీక్షలో మొత్తం 500 మంది విద్యార్థులను చేవెళ్ల పాఠశాలకు కేటాయించగా,అందులో బాలికలు 252 మందికి గాను 224 మంది బాలికలు హాజరయ్యారు.బాలురు 248 గాను 225 మంది హాజరయ్యారన్నారు.బాలికలు 88.8% బాలురు 90.7% మొత్తం కలిపి 89.8% మంది విద్యార్థులు చేవెళ్ల గురుకుల పాఠశాలలో పరీక్షకు హాజరవ్వడం జరిగిందని తెలిపారు.టీజీ సెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని చేవెళ్ల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి మాలతి మీడియాకు తెలిపారు…