BB6 TELUGU NEWS CHANNEL
యువకులు నిత్యం క్రీడా సాధన తో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ఉల్లాసంతో ఉంటారని గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, జంగం రెడ్డి పల్లి గ్రామం సర్పంచ్ అనసూయమ్మ అన్నారు. ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన జంగం రెడ్డిపల్లి జట్టుకు బహుమతితోపాటు 9 వేల రూపాయల నగదును అందజేశారు. రెండో స్థానంలో నిలిచిన రుసుంపల్లి జట్టుకు 5 వేల రూపాయల నగాదును అందజేశారు. ఈ కార్యక్రమంలో గండీడ్ గ్రామ సర్పంచ్ భగవంతు రెడ్డి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపిటిసి బాలయ్య, ఉప సర్పంచ్ వెంకటయ్య, వెంకన్న గౌడ్, మాజీ సర్పంచ్ హనుమంతు, రమేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పెంటయ్య, కోస్గి అనిల్, కోస్గి వెంకటేష్,సంటెమ్ శేఖర్, కోస్గి శ్రీనివాస్,గ్రామ యువకులు పాల్గొన్నారు
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి
01
Feb