వేణుగోపాల స్వామి ఆలయంలో సుదర్శన హోమం

నార్కట్ పల్లి, BB6 NEWS తెలుగు ఉబ్బని శేఖర్): మండలపరిధిలో  గోపలాయ పల్లి గ్రామం గుట్టపైన వెలిసిన స్వయంభు శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయంలో ఆదివారం సుదర్శన హోమం, నరసింహ హోమం, వేద పాఠశాల ప్రిన్సిపాల్, దేవాలయ ప్రధాన పూజారి, దత్తాత్రేయ శర్మ, దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ధర్మపత్ని రాజేశ్వరి దేవి, ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు,  అనంతరం హోమంలో కూర్చున్న వారికి దేవాలయ ఆధ్వర్యంలో శాలువాగప్పి సన్మానించారు. వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు.దేవాలయ కార్యనిర్వాహణాధికారి చిక్కేటి వెంకటరెడ్డి, హోమంలో కూర్చున్న వారు తీగల యాదగిరిరావు ధర్మపత్ని చంద్రకళ. దేవేందర్ గౌడ్ ధర్మపత్తులు సుజాత. దీప విజయభాస్కర్ రెడ్డి ధర్మపత్ని నిర్మలాదేవి. అంజయ్య ధర్మపత్ని మల్లేశ్వరి. అనంత చారి ధర్మపత్ని గీత. శ్రీమన్నారాయణ ధర్మపత్ని రమాదేవి, ఈ కార్యక్రమంలో దోసపాటి విష్ణుమూర్తి, షరాబు శ్రీనివాసు, దేవాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe