BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్,బల్సుర్ గొండ,ఆశి రెడ్డిపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్బంగా పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ ఏర్పాటు కొనుగోలు కేంద్రాలలోని అమ్ముకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి,గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆశన్న, ఏపీఎం రజిత, సీఈవో శీలం ఆశన్న,ఖాజా, ఏఈఓ వరలక్ష్మి, రైతులు పాల్గొన్నారు*
PACS ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం
09
Nov