వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం, తిరుమలపూర్ గ్రామంలో ,ఆదివారం అర్ధరాత్రి 11:30 గంటలకు నేరటి శీను అనే ఇంటికి అగాంతకుడు నిప్పు పెట్టి భయభ్రాంతులకు గురి చేశాడు. అర్ధరాత్రి సమయంలో నీరటి శీను తన కుటుంబంతో నిద్రిస్తున్న ,సమయంలో ఒక్కసారిగా నిప్పులు ఇంట్లో కి చేరి దుప్పటిపై అంటుకోగా ,వెంటనే బయటికి వచ్చి ఇంటి పైకప్పు పై మంటలను చూసి, వెంటనే నీళ్లు చల్లి మంటలను ఆర్పి ,గమనించగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి పై పెట్రోల్ పోసి, నిప్పంటించాడని నీరటి శీను చెప్పుకొచ్చాడు. ఊరి మధ్యలో హనుమాన్ మందిరం ఆవరణలో సీసీ కెమెరాలు ఉన్న పనిచేయని వైనం.

