Meeseva Charges Hike :
తెలంగాణ పబ్లిక్ కు అలర్ట్ మీసేవ సెంటర్కు పోతున్నారా..?చార్జీలు పెరిగాయ్!

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో సర్వీస్ ధరలను పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీవో జారీ అయింది. ఏ సర్టిఫికెట్‌కు ఎంత పెరిగిందో చూడండి.

తెలంగాణలో పలు రకాల సర్టిఫికెట్లను మీ సేవ ద్వారా పొందవచ్చు. ఈ సర్వీస్ ద్వారా జనాలు మీ సేవకు వెళ్లి కావాల్సిన పత్రాలను అప్లై చేసుకుంటున్నారు. ఇందుకుగానూ ఛార్జీలను వసూలు చేస్తాయి మీ సేవ కేంద్రాలు. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ కేంద్రాల్లో సర్వీసుల ధరలను పెంచింది. దీంతో సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఇక నుంచి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది

జీవో ప్రకారం.. మీ సేవలో అన్ని సర్వీసులపై 50 శాతం ధరలు పెంచారు. ఆదాయ, కుల, స్థానికత లాంటి సర్టిఫికెట్లు జారీ చేయడానికి రూ.80 రుసుం చేశారు. అలాగే జనన ధ్రువీకరణ పత్రం రుసుం రూ.62 చేశారు.

మీ సేవ సర్వీసుల ఛార్జీలు ఏప్రిల్ 1 నుండి అధికారికంగా అమలులోకి వస్తాయి. సుమారు ఎనిమిదేళ్లలో మీసేవా ఫీజు విధానాన్ని నవీకరించడం ఇదే మొదటిసారి. చివరి సవరణ 2018-19లో జరిగింది.

కేటగిరీ ఎ (ప్రాథమిక సర్టిఫికెట్లు) ఇప్పుడు రూ. 62కి పెంచారు.
కేటగిరీ బి (ప్రధాన సర్టిఫికెట్లు/దరఖాస్తులు) ఇప్పుడు రూ. 80 చేశారు.
ప్రభుత్వం అత్యంత తరచుగా ఉపయోగించే ప్రజా సేవల ఖర్చులను క్రమబద్ధీకరించింది. ఈ పాస్ బయోమెట్రిక్‌కు రూ. 35, రైతు నమోదు రుసుము రూ.18గా ఉన్నాయి. ఆహార భద్రతా కార్డు దరఖాస్తులు/సవరణలు: రుసుము స్థిరంగా రూ. 80గా నిర్ణయించారు. ఆర్టీఏ డీఎల్ ఫీజు చెల్లింపులు, ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్: రూ. 62కి సవరించారు.

ప్రింటింగ్/స్కానింగ్ ఛార్జీలు: ఒక లావాదేవీలోని మొదటి నాలుగు పేజీలకు మించి అవసరమయ్యే ఏ స్కానింగ్ లేదా ప్రింటింగ్‌కైనా, ప్రతి పేజీకి రూ. 2.50 రుసుము వర్తిస్తుంది. విద్యుత్ బిల్లు చెల్లింపులు (TGSPDCL/TGNPCL) ఇప్పుడు బిల్లు మొత్తం ఆధారంగా పైన ఛార్జీలు వసూలు చేస్తారు.

రూ. 200 వరకు: రూ. 4
రూ. 201 – రూ. 1,000: రూ. 9
రూ. 1,001 – రూ. 2,500: రూ. 18
రూ. 2,500 పైన: రూ. 44
అధిక ఛార్జీలు వసూలు చేసిన పక్షంలో, పౌరులు 1800 425 1110 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. కేటగిరీ-ఎ, కేటగిరీ-బి కింద వచ్చే దాదాపు అన్ని సేవలపై కూడా భారం పడింది. మీ సేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఆపరేటర్ల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ ధరల సవరణ చేపట్టినట్టుగా వెల్లడించింది.

అయితే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు విద్యార్థులు క్యాస్ట్, ఇన్‌‌కమ్ సర్టిఫికేట్లు చేయించుకుంటారు. ఇలాంటి సమయంలో ధరలు పెంచడంపై సామాన్యులపై భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

రూ. 200 వరకు: రూ. 4
రూ. 201 – రూ. 1,000: రూ. 9
రూ. 1,001 – రూ. 2,500: రూ. 18
రూ. 2,500 పైన: రూ. 44
అధిక ఛార్జీలు వసూలు చేసిన పక్షంలో, పౌరులు 1800 425 1110 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. కేటగిరీ-ఎ, కేటగిరీ-బి కింద వచ్చే దాదాపు అన్ని సేవలపై కూడా భారం పడింది. మీ సేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఆపరేటర్ల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ ధరల సవరణ చేపట్టినట్టుగా వెల్లడించింది.

అయితే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు విద్యార్థులు క్యాస్ట్, ఇన్‌‌కమ్ సర్టిఫికేట్లు చేయించుకుంటారు. ఇలాంటి సమయంలో ధరలు పెంచడంపై సామాన్యులపై భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe