BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ₹40 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్ను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
🔹ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.నూతనంగా నిర్మించిన గదులు,సైన్స్ ల్యాబ్ విద్యార్థులకి ప్రయోజనకరంగా ఉండి,వారికి ప్రయోగాత్మక విద్యలో సహాయపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి , కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగరి శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో మంజుల,గండీడ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు ర్యాగరి భగవంతు రెడ్డి, మండల తహసిల్దార్ బ్రహ్మరౌతు మల్లికార్జునరావు, కొటాల చిన్నయ్య, వెన్నచెడ్ మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.




