BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రం లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలుగానే కాకుండా, మత సామరస్యానికి అద్దం పట్టే అరుదైన దృశ్యానికి వేదికయ్యాయి. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, కులమతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉండాలనే గొప్ప సందేశాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి.
ముఖ్యంగా ఈ ఉత్సవాల్లో ముస్లిం సోదరులు సిరాజ్ మరియు అతహర్ హుస్సేన్ స్వచ్ఛందంగా పాల్గొని తమ సోదరభావాన్ని చాటుకున్నారు. . మతం ఏదైనా మానవత్వం ఒక్కటేనని, ఇలాంటి ఐక్యత సమాజానికి ఎంతో అవసరమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ర్యాగరి భగవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగరి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న ఈ సామరస్య వాతావరణాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల విజయవంతంలో గ్రామ యువకులు కేశవులు, శ్రీనివాస్, మోర హన్మంతు, జోగు కృష్ణ, కుమ్మరి శ్రీను, చెందయ్య ,నర్సింహ రెడ్డి, కుమ్మరి రాములు, బాబ్రీ తదితరులు కీలక పాత్ర పోషించారు.
గండిడ్లో మిన్నంటిన శ్రీరామనవమి వేడుకలు , వెల్లివిరిసిన మత సామరస్యం
27
Mar