ఇంటర్ విద్యార్థులకు విజ్ఞప్తి విద్యార్థులందరికి మంచి మార్కులు వచ్చేలా రాయండి. సదానందం గౌడు

రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు మన కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్/హిస్టరీ/సివిక్స్ లెక్చరర్ ఆయిల్ సదానందం గౌడు.. ఈ సందర్బంగా మీడియా ద్వారా అందిస్తున్న సూచనలు..

విద్యార్థినీ,విద్యార్థులారా
అదురు బెదురు లేకుండా
ధైర్యంగా ఎగ్జామ్స్ వ్రాయండి
టైం కు ఎగ్జామ్ హాల్ కు చేరుకోండని సూచించారు.టెన్షన్ పడొద్దు రిలాక్స్ గా ఉండండి
హెడ్ లైన్స్ పెట్టి అండర్ లైన్ చేయండి.స్వంత కవిత్వాలు వద్దు
క్వశ్చన్ టు అన్సర్స్ ఉండాలన్నారు.

బజార్లో తిరగడం బంజేయండి,టైం పాస్ ముచ్చట్లు మానుకోండి,టైం వేస్టు చేయకుండా,ఇంటివద్దే ఉండి చక్కగా చదవండన్నారు.
ఒకటికి రెండు సార్లు చదవండి
మనసుపెట్టి మంచిగా చదవండి
ర్యాంకులు సాధించేలా చదవండి.

మీరు చదువుకుంటున్న కాలేజీకి
మంచిగా పేరు తెచ్చేలా చదవండి,ఉన్న ఊరు,కన్న తల్లిదండ్రులు,చదువు నేర్పిన గురువులు,సమాజం మొత్తం కూడా గర్వపడేలా చదవండని అన్నారు.

కొట్టివేతలు లేకుండా
ఎగ్జామ్స్ వ్రాయండి,అన్ని ప్రశ్నలకు చక్కగా
జవాబులు వ్రాయాలన్నారు.

*మార్కులు కాదు..మిమ్మల్ని గుర్తుంచుకోనేలా..*

మార్కులు కాదు..మిమ్మల్ని గుర్తుంచుకోనేలా రాయాలని సూచించారు.ఇందు కోసం కేవలం సగటు 35 మార్కుల కోసం కాదు,98,99మర్కులు వచ్చేలా రాయండన్నారు.అత్యదిక మార్కులు మీకే వచ్చేలా రాయండని సూచించారు.ప్రతి ఒక్కరిలో శక్తి ఉంది,చదువు ఉంది కానీ,కొందరికే ఎందుకు నూటికి 99,98 ఇష్టంతో కష్టపడి చదివితే విద్యార్థులందరూ మంచి  మార్కులు రావడం ఖాయమని సూచించారు.

ఇంటర్ విద్యార్థులకు విజ్ఞప్తి
విద్యార్థులందరికి మంచి మార్కులు వచ్చేలా రాయండి.
కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్/హిస్టరీ/సివిక్స్ లెక్చరర్ ఆయిల్ సదానందం గౌడు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe