72వ అఖిల భారత సహకార వారోత్సవాలు – నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి PACSలో సహకార పతాక ఆవిష్కరణ

BB6 TELUGU NEWS CHANNEL
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల పరిధిలోని దుర్కి గ్రామంలోని ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (PACS)లో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరానికి సహకార వారోత్సవాల ఇతివృత్తం *”సహకార సంస్థల ద్వారా ఆత్మనిర్భర్ భారత్”గా నిర్ణయించబడింది. ఈ సందర్భంగా PACS కార్యాలయంలో సహకార పతాకాన్ని *PACS చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్* ఆవిష్కరించారు. కార్యక్రమంలో *PACS డైరెక్టర్లు పి. శ్రీనివాస్, జె. గంగారాం, డి. రాజు, రాములు, PACS సెక్రటరీ ఎస్. సుధాకర్ తో పాటు గ్రామప్రజలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*

ఈ సందర్భంగా మాట్లాడిన *చైర్మన్ శ్రీనివాస్ యాదవ్* మాట్లాడుతూ, సహకార సంస్థలు గ్రామీణాభివృద్ధికి వెన్నెముకలా పనిచేస్తాయని, రైతుల ఆర్థిక అభివృద్ధికి PACSలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో సహకార వ్యవస్థ మరింత బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe