ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య డిమాండ్
BB6 TELUGU NEWS CHANNEL
నీట్ పరీక్షలో అవకతవకలు గురించి ప్రశ్నిస్తూ పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ చేపట్టిన ఉద్యమాన్ని అణిచివేయడాన్ని అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీలు అవినీతి ఆరోపణల వల్ల దేశ పరీక్ష విధానంలో ఉన్న లోపాలు బయటపడ్డాయని దీనివల్ల లక్షలాదిమంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య ప్రశ్నించారు.పరీక్షల మాఫియా కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా నష్టపోకూడదని కోరారు దేశవ్యాప్తంగా నిర్వహించే వైద్య ప్రవేశ పరీక్షలను వికేంద్రీకరించాలని ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.