కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శ్రీ తీన్మార్ మల్లన్న
BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా మహిళా నాయకురాలు *చెరుకూరి మౌనిక మరియు జిల్లా నాయకులు మంద దిలీప్* గార్ల ఆధ్వర్యంలో జనగామ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు తీన్మార్ మల్లన్న గారు సమక్షంలో టీఆర్పీ పార్టీలో చేరారు. కొత్తగా చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి మల్లన్న గారు ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ పార్టీ ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందని,వివిధ జిల్లాల నుండి అనేక మంది పార్టీలోకి చేరుతున్నారని పేర్కొన్నారు.
నూతనంగా పార్టీ లో చేరిన వారు కుమార్, బోడ భాస్కర్, గాడిపెల్లి యాకన్నా, ముక్క విష్ణు, వాల్లాలా భాను చందర్, దాసరి సంధ్యా రాణి, భూక్యా విజయ, ఎర్ర సంపత్, మహమ్మద్ రిజ్వాన్, మహేష్ మరియు తదితరులు పార్టీలో చేరారు.