భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థపాక అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న

వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన  భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థపాక అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న  TRP పార్టీ  రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

TRP పార్టీ నూతన కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు

ఈ సందర్బంగా  ఆలయ సిబ్బంది పూర్ణకుంభం తో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, TRP పార్టీ దిగ్విజయంగా రాబోయే ఎన్నికలో గెలవాలని అమ్మవారిని స్మరించుకున్నారు!!  అనంతరం ఆలయ అర్చకులు  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని TRP పార్టీ కార్యవర్గ సభ్యులను వేద మంత్రాలతో ఆశీర్వదించి అమ్మవారి మహా ప్రసాదం అందచేశారు.

అమ్మవారిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

భద్రకాళీ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ లో   మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు,TRP పార్టీ మీద మల్లన్న గారి మీద ఎల్లపుడు ఉండాలి అని,అమ్మవారి ఆశీస్సులతో అందరూ మంచిగా ఉండాలి అని హితవుపలికారు!!
ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న గారి అభిమానూలు, TRP పార్టీ నూతన కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు

Related News

అడ్వర్టైజ్మెంట్
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe