MRPS 31వ, ఆవిర్భావ దినోత్సవం జెండావిష్కరణ విజయవంతం*

మహబూబ్ నగర్  జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది మంద కృష్ణ మాదిగ ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో1994 లో మొట్టమొదటి సారిగా దండోరా జండా ఆవిష్కరించి ఎస్సీలకు ఏ బి సి డి వర్గీకరణ జరగాలని ఎన్నో పోరాటాలు చేశారు. పేద ప్రజల వైద్యం కోసం ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది వికలాంగులకు పెన్షన్ పెంచడం వంటి వాటిలో అమలు చేయించి ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగింది మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ అమలు కావడం ప్రపంచమంతా హర్షించదగ్గ విషయం ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కామి వెంకట్ రాములు, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు ఎం. ఆశన్న, మండల మాజీ ఎంపీపీ కొమీరే లక్ష్మయ్య,మాజీ జెడ్పిటిసి జంగల్ల వెంకటయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గుముడాల చెన్నయ్య ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య గండీడ్ మండల టిఎమ్ఆర్పిఎస్ అధ్యక్షులు కొండాపూర్ దస్తయ్య, రంగారెడ్డి పల్లి మాజీ ఎంపిటిసి కుందేటి కిష్టయ్య ,వెన్నచెడు మాజీ ఎంపిటిసి ఆశన్న గౌడ్, కొప్పుల శ్రీధర్ మండల ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి జూలపల్లి వివేకానంద మండల ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి బాగయపల్లి శంకర్ ఉపాధ్యక్షులు నాగరాజు, రాము రావణ్ ధర్మ, మన్సూర్ పల్లి తిరుపతయ్య కొప్పుల సుదర్శన్, పిట్ల మాణిక్యం, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు కోట్యనాయక్ ఎమ్మార్పీఎస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కామి సంజీవ్, కర్రె బచ్చయ్య, అశోక్, గండీడ్ హస్నాబాద్ శ్రీనివాస్, వేపూరి  కేశవులు, హస్నాబాద్ ఎల్లయ్య ,నర్సింలు ,అయ్యి శ్రీనివాస్ ,పెంటయ్య ,కొప్పుల భీమయ్య, పెద్ద హనుమయ్య, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe