కార్యకర్త కష్టంలో ఉన్నాడంటే.. నేనున్నానంటూ ముందుకొచ్చే ప్రజా నాయకుడు మన డా.వెన్న ఈశ్వరప్ప
BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ మండలం, జిన్నారం తండా గ్రామానికి చెందిన గిరిజన మోర్చా నాయకులు కాట్రావత్ గంగ్య నాయక్ అనారోగ్యంతో గచ్చిబౌలి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సేవారత్న అవార్డు గ్రహీత డా.వెన్న ఈశ్వరప్ప వెంటనే స్పందించారు. ఆసుపత్రికి చేరుకుని గంగ్య నాయక్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, స్థానిక నాయకులతో కలిసి తక్షణ సహాయం కింద ₹50,000/- ఆర్థిక సహాయాన్ని వారి భార్య పల్లవికి అందజేశారు.
కార్యకర్త సంక్షేమమే పరమావధిగా భావించే నాయకుడు మన డా. వెన్న ఈశ్వరప్ప