మాజీ సర్పంచ్ హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్టు
* 10మంది అరెస్టు
* నిందితుల నుంచి రూ.8.50లక్షలు, 4కార్లు, 1-బొలేరో, 2బైక్ లు, 11 మొబైల్ స్వాధీనం.
హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్టు
BB6 TELUGU NEWS CHANNEL
గద్వాల: కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు ఛేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 8,50,000 రూపాయలు, 4కార్లు, 1-బొలేరో, 2బైక్ లు, 11 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
రిమాండ్ కు తరలించిన వారిలో మిల్లు వీరన్న, కుర్వ సురేందర్, బోయ వీరన్న, తెలుగు మధు బాబు, తెలుగు కృష్ణ, సంజీవులు, బైరీ సుంకన్న, బైరీ కేశన్న, ప్రభుస్వామి, హరిజన్ రాజేశ్ ఉండగా, కర్నూల్ జిల్లాకు చెందిన ఈశ్వర్య గౌడ్ పరారిలో ఉన్నారు.