BB6 TELUGU NEWS CHANNEL
మేడ్చల్ జిల్లా, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.ఎస్.ఆర్. గార్డెన్స్లో విషాదం చోటుచేసుకుంది. పోలీసు పరేడ్ జరుగుతున్న సమయంలో ఆరోగ్యం సహకరించక పక్కన నిలబడ్డ ఏఎస్ఐ దేవిసింగ్ (60)ను ఓ వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. గార్డెన్స్ నుండి బయటకు వెళ్లే క్రమంలో పక్కన నిలబడ్డ ఏఎస్ఐను ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐ దేవిసింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాటర్ ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి
03
Nov