సిపిఐ జాతీయ సమితిలో తెలంగాణకు సముచిత స్థానం జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకట్ రెడ్డి

మరోసారి జాతీయ కార్యవర్గంలోకి కూనంనేని సాంబశివరావు, పశ్యపద్మ

కంట్రోల్ కమిషన్ సభ్యులుగా ఎం.డి.యూసుఫ్

జాతీయ సమితిలోకి 10 మంది, అందులో ఒకరు క్యాండిడేట్ సభ్యులు

BB6 TELUGU NEWS CHANNEL
కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నగర్  (చండీగఢ్):సిపిఐ జాతీయ సమితిలో తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం లభించింది. సిపిఐ జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకట్ రెడ్డి తొలిసారిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు జాతీయ కార్యదర్శివర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఎంపి సయ్యద్ అజీజ్ పాషా తప్పుకున్నారు.

నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా వెంకట్ రెడ్డి ఎఐఎస్ఎఫ్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. ఆయన సిపిఐ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన గతంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా,  2004లో మునుగోడు నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. సిపిఐ జాతీయ కార్యవర్గానికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఎన్నికయ్యారు. అలాగే కంట్రోల్ కమిషన్ సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎం.డి.యూసుఫ్ ఎన్నికయ్యారు. కంట్రోల్ కమిషన్ సభ్యులుగా ఆయన జాతీయ సమితికి శాశ్వతాహ్వానితులుగా ఉంటారు.
*పది మంది జాతీయ సమితి సభ్యులు :* రాష్ట్రం నుంచి సిపిఐ జాతీయ సమితికి పది మంది సభ్యులు ఎన్నికయ్యారు. వారు కూనంనేని సాంబశివరావు,పశ్య పద్మ,పల్లా వెంకట్ రెడ్డి,తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు,ఇ.టి.నర్సింహా,బాగం హేమంతరావు, కలవేన శంకర్, ఎం.బాలనర్సింహా, ఎస్.కె.సాబీర్ పాషా ఉన్నారు. క్యాండిడేట్ సభ్యుడుగా పాల్మాకుల జంగయ్య ఎన్నికయ్యారు. వీరిలో ఎస్.కె.సాబీర్ పాషా, పాల్మాకుల జంగయ్య తొలిసారిగా ఎన్నికయ్యారు.

*సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మెన్ డాక్టర్ కె.నారాయణ*
సిపిఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ఎన్నికయ్యారు.  తొలుత చండీగఢ్ జరిగిన సిపిఐ జాతీయ 25వ మహాసభ చివరి రోజున ప్రతినిధులు సెంట్రల్ కంట్రోట్ కమిటీ సభ్యులుగా 11 మందిని ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో డాక్టర్ కె.నారాయణ, హర్ సింగ్ ఆర్శీ (పంజాబ్), ఎం.డి.యూసుఫ్(తెలంగాణ), కల్యాణ్ బెనర్జీ (పశ్చిమ బెంగాల్), పి.దుర్గా భవాని (ఆంధ్రప్రదేశ్), ఆర్.ముత్తురాసన్ (తమిళనాడు), రామ్ బహేతి(మహారాష్ట్ర), ఇంతియాజ్ అహ్మద్ (ఉత్తర్ ప్రదేశ్), సత్యన్ మొకెరి(కేరళ), సి.హెచ్.వెంకటాచలం, రామ్ రతన్ సింగ్ (బిహార్)లు ఉన్నారు. అనంతరం కమిటీ సమావేశమై సెంట్రల్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.నారాయణను, కార్యదర్శిగా రామ్ బహేతిని ఎన్నుకుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe