ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత

సోమవారం ఉదయం 7:20 గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు

ఏడు గంటల 25 నిమిషాలకు మరణించినట్లు ప్రకటించిన డాక్టర్లు

BB6 TELUGU NEWS CHANNEL
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.  తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని  గుర్తుచేశారు.

అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని,  అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గారు స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ… ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి గారు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు‌. అందెశ్రీ గారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe