BB6 TELUGU NEWS CHANNEL
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జ్ దగ్గర కూడా మంగళవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వడ్ల లోడ్ ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.పలువురికి గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మెట్ పల్లి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ఘటన జరిగింది.
